సిరాన్యూస్, ఇచ్చోడ
వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏఎన్ఎం కరుణ
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎన్ఎం కరుణ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గాంధీనగర్ గ్రామంలో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం కరుణ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి శుభ్రతతో పాటు చుట్టూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నీటి తొట్టెలలో ఉన్న నీటిని తొలగించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్త పాల్గొన్నారు.