సిరా న్యూస్, ఆదిలాబాద్
ఆశాలకు ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
* కలెక్టర్కు వినతి పత్రం అందజేత
ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. గురువారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ అదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పాలనాధికారికి ఆశాల సమస్యలను పరిష్కారం చేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతంలో గత 33 సంవత్సరాలు మైదాన ప్రాంతంలో గత 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్ లు పొందారని, రిజిస్టర్ రాయడం సర్వేలు చేయడం,ఆన్లైన్ పని చేయడం,బిపి, షుగర్, థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను గుర్తిస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషించారన్నారు. ఇంత సీనియారిటీ ఉన్న ఆశ వర్కర్లకు కొత్తగా ఎగ్జామ్స్ నిర్వహించి కొత్తగా ఆశాల జ్ఞాపకశక్తిని మళ్ళీ నిరూపించుకోవాలని చెప్పడం సమంజసం కాదన్నారు. వెంటనే పరీక్షల నిర్వహణ ఆలోచనను వెంటనే విరామించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న , ఆశా యూనియన్ జిల్లాఅధ్యక్ష కార్యదర్శి నైతం శోభ, ఎం. సుజాత, ఆశా నాయకులు గంగమ్మ,ఆశా,అర్చన,లక్ష్మి,కాంత, పుష్పలత, రుక్మిణి, పుష్ప, సురేఖ, లక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.