హిమాంబి పై మరో కేసు నమోదు

సిరా న్యూస్,హైదరాబాద్;
యూసుఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్నగర్లో పుట్టా రాము హత్య కేసులో నిందితురాలు హిమాంబీతోపాటు ఆమె కుమార్తె, భర్త తమ ఇంటిని ఆక్రమించుకుని బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన బత్తిన దర్మారెడ్డి 2021లో ఎల్ఎన్నగర్లో 60 గజాల ఇంటిని మహేశ్వర్ రెడ్డి వద్ద నుంచి కొనుగోలు చేశాడు. ఆ ఇంటిలో హిమాంబీ కుటుంబం అద్దెకు ఉంది. ఇంటిని ఖాళీ చేయడానికి రెండు నెలల సమయం ఇవ్వాలని, అప్పటి వరకు అద్దె చెల్లిస్తామని దర్మారెడ్డిని కోరారు. మూడు నెలలు గడిచినా ఇల్లు ఖాళీ చేయకపోవడంతో పాటు అడిగేందుకు వెళ్లిన ధర్మారెడ్డిని, మహేశ్వర్రెడ్డిని బెదిరించారు. దీంతో ధర్మారెడ్డి కోర్టును ఆశ్రయించగా.. ఇంటిని ఖాళీ చేయాలని తీర్పు వచ్చింది. కోర్టు సిబ్బందితో కలిసి ధర్మారెడ్డి ఇంటి వద్దకు వెళ్లగా.. హిమాంబీ తదితరులు తీవ్రస్థాయిలో గొడవకు దిగారు. ఆ ఇంట్లో హిమాంబీ వ్యభిచార గృహం, పేకాట, తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. పుట్టా రామును కూడా దారుణంగా హత్య చేయించారని తెలుసుకున్న ఇంటి యజమాని ధర్మారెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *