సిరా న్యూస్,అమలాపురం;
అంబెడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే ఆలయ నిర్మాత కోపనాతి క్రిష్ణమ్మ కుటుంబికులు మాకు గౌరవం దక్కడం లేదని అంటున్నారు. పది రోజుల పాటు జరగనున్న కల్యాణ మహోత్సవాలకు అధికారులు అమలాపురం తాలూకు అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఓడలరేవు నుండి గజమాల యాత్ర చేపడతాం. కానీ మాకు ఆలయంలో గౌరవం దక్కడం లేదంటూ కోపనాతి క్రిష్ణమ్మ కుటుంబికులు ఆగ్రహం వ్యక్తం చేసత్ఉన్నారు.మాకు ప్రోటోకాల్ ఇవ్వాలంటు కోరారు. రధం దగ్ధం అయి రెండు ఏళ్లు అవుతున్న నిందితులను పట్టుకోలేకపోయారు. కొత్త రథాన్ని తయారు చేసి చేతులు దులుపుకొన్నారు అంటూ కుటింబికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ..