గుడివాడలో టీడీపీ తరుపున కుమారీ ఆంటీ ప్రచారం

సిరా న్యూస్,విజయవాడ;

ఏపీ ఎన్నికల వేళ కుమారి ఆంటీ మరోసారి జనాల్లోకి వచ్చారు. ఆమె సొంత ఊరు గుడివాడ.. సో.. అక్కడ టీడీపీ అభ్యర్థి తరఫున ఆమె ప్రచారం చేయడం విశేషం. గుడివాడలో టీడీపీ నుంచి బరిలో ఉన్న కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాముకు కుమారి ఆంటీ సపోర్ట్ చేస్తున్నారు. గుడివాడలోని 21, 24,25, 31, 32 వార్డుల్లో ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. వెనిగండ్ల రాముపై కుమారి ఆంటీ ప్రశంసలు గుప్పించారు. ఆయన మహర్షి సినిమాలో మహేష్‌బాబులా మంచి మనసున్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఆ మూవీలో మహేష్‌బాబు ప్రజల కోసం సేవ చేస్తే.. గుడివాడలో రియల్‌గా వెనిగండ్ల రాము ప్రజలకు సర్వీస్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు కుమారి ఆంటీ. వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ డెవలప్‌మెంట్ జరుగుతుందని చెప్పారు. గుడివాడలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందన్నారు. గుడివాడలో వెనిగండ్ల రామును, మచిలీపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని, ఎన్డీఏకు అందరూ మద్దతు తెలపాలని కుమారీ ఆంటీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *