సిరా న్యూస్, జైనథ్:
నకిలి విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ఫోర్స్
నకిలీ విత్తనాలు అరికట్టేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ టీంను ఏర్పాటు చేసినట్లు ఏవో వివేక్ తెలిపారు. ఈ టీంలో తనతో పాటు తహాసీల్దార్ శ్యాంసుందర్, ఎస్సై పురుషోత్తంలు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని రైతువేధికలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏఈవోలఉ వారికి కేటాయించిన గ్రామాల్లో తరుచుగా పర్యటిస్తూ. రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహణ పెంచాలన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించిన రసీద్లలను రైతులు భద్రపరిచేలా వారిని చైతన్యవంతులుగా చేయాలన్నారు. డీలర్లు సైతం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని, నిబంధనలకు లోబడి స్టాక్, సేల్స్ తదితర రిజిస్టర్లను మెయింటైన్ చేయాలన్నారు. అనంతరం టాస్క్ఫోర్స్ టీంతో కలిసి మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువుల షాపులను ఆయన తనిఖీ చేసారు.