ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ

సిరా న్యూస్,విజయవాడ;
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం స్వాగతం పలికారు.అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ విజయవాడలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది. మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టింది.. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది. రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారు. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించాం.ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించాం. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *