సిరా న్యూస్,హైదరాబాద్;
శనివారం నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. అయన పర్యటనకు తెలంగాణ జనసేన నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ జనసేన ప్రచరకమిటీ చైర్మెన్ సాగర్ కె నాయుడు మాట్లాడుతూ శనివారం ఉదయం 7గంటలకు మాదాపూర్ లోనీ తన నివాసం నుంచి కొండగట్టుకు పవన్ రోడ్డు మార్గాన బయలు దేరుతారు. పవన్ అభిమానులు, కార్యకర్తలు పోలీసులకు సహరించాలి. తెలంగాణలో జనసేన బలోపేతంపై ఫోకస్ పవన్ ఫోకస్ పెడతారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరుపున పోరాటం చేస్తాం. సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని అన్నారు. ఏపీలో జనసేన విజయం ప్రభావరం తెలంగాణపై ఉంటోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా.. ఇతర పార్టీల వారు జనసేనలో చేరుతారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోయాలని పవన్ ను కోరుతాం. జనసేనలో పనిచేయటానికి యువత ఉత్సాహంగా ఉన్నారని అన్నారు.
========