APD Krishna Rao: రికార్డుల‌ను అందుబాటులో ఉంచాలి: ఏపీడీ కృష్ణారావు

సిరాన్యూస్ ,బోథ్‌
రికార్డుల‌ను అందుబాటులో ఉంచాలి: ఏపీడీ కృష్ణారావు
* ఉపాధి హామీ పనుల రికార్డులు తనిఖీ

సామాజిక త‌నిఖీ బృందాల వారు రానున్నందున అవ‌స‌ర‌మైన రికార్డుల‌ను అందుబాటులో ఉంచాలని ఏపీడీ కృష్ణారావు అన్నారు.ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో బుధవారం ఏపీడీ కృష్ణారావు రికార్డు లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇంతవరకు పూర్తి అయిన పనుల వివరాలతో పాటు ఎంబి రికార్డులను పరిశీలించారు. అంతేకాక సామాజిక త‌నిఖీ బృందాల వారు రానునందున అవసరమైన రికార్డులన్నీ అందుబాటులో ఉంచాలని ఏపీఓ జగదే రావుకు సూచించారు. మండలంలోని ఆయా గ్రామాల సీసీల వారిగా రికార్డులు పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *