మైనారిటీ గురుకులాలలో ప్రవేశాల కొరకు దరఖాస్తు

జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్ మేరాజ్ మహ్ముద్
సిరా న్యూస్,పెద్దపల్లి;
మైనారిటీ గురుకులాల పాఠశాల, కళాశాలల్లో ప్రవేశాల కొరకు మార్చి 31 వరకు గడువు పొడిగించడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్ మేరాజ్ మహ్ముద్ సోమవారం తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల/కళాశాలలలో 5 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, అలాగే 6, 7, 8 తరగతులలో మిగిలిన సీట్లకు www.tmreis.telangana.gov.in వెబ్ సైట్ లో ధరఖాస్తు చేసుకోవాలని, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం లేదా స్టడీ సర్టిఫికేట్, కుటుంబ ఆదాయ సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్ (అవసరమైనచో), సెల్ నంబరు, నివాస ధృవీకరణ సర్టిఫికేట్ జత చేయాలని అన్నారు. మైనారిటీ గురుకులాలలో ప్రవేశాలపై ఇతర వివరాలకు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి, పాఠశాలల లేదా కళాశాలల ప్రిన్సిపాళ్లను ( పెద్దపల్లి గర్ల్స్ స్కూల్ – 7331170848, పెద్దపల్లి గర్ల్స్ కాలేజీ – 9603313883, రామగుండం బాలుర స్కూల్ –7331170845, రామగుండం బాలుర కాలేజీ – 9948978628, మంథని గర్ల్స్ స్కూల్ -7995057944, మంథని గర్ల్స్ కాలేజీ – 8096286629 నందు సంప్రదించాలని మొహమ్మద్ మేరాజ్ మహ్ముద్ తెలిపారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *