పనిచేసే నాయకుడికి పట్టం కట్టండి

జగిత్యాలలో పిఎఫ్, పాస్ పోర్ట్ కార్యాలయాల ఏర్పాటు జీవన్ రెడ్డి తోనే సాధ్యం

అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి ఇంటింటా ప్రచారం

సిరా న్యూస్,జగిత్యాల;

గత నలభై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉండి జగిత్యాల నియోజవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేశాడని నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డి ని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవరర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాడని, పనిచేసే నాయకుడికి పట్టం కట్టాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఓటర్లను కోరారు.
జగిత్యాల పట్టణంలోని 37వ వార్డులో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపే లక్ష్యoగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా
చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ
బీడీ కార్మికులకువెయ్యి బీడీలకు 230 రూపాయలు మజూర్ ఉందని దీన్ని రాబోయే రోజుల్లో 300 రూపాయలు చేయడమే లక్ష్యంగా జీవన్ రెడ్డి పెట్టుకున్నారని తెలిపారు.
40 సంవత్సరాలుగా జగిత్యాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నా జీవన్ రెడ్డి ఎలా పనిచేస్తారో, ఎలాంటి నాయకుడో ప్రతి ఒక్కరికి తెలుసని ఒక ఫోన్ కాల్ తో ఏ పని అయిన చేయిస్తారనిఅటువంటి నాయకుడిని ఎంపీగా గెలిపించుకుందామని అందుకు మీ ఆశీర్వాదం ఉండాలని విజ్ఞప్తి చేశారు.

జగిత్యాలలో పిఎఫ్ ఆఫీస్ లేదని, ఎన్నికల తదుపరి పిఎఫ్ ఆఫీస్ కూడా జగిత్యాలకు తీసుకువచ్చేలా జీవన్ రెడ్డి కృషి చేస్తారని,అలాగే
జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడిన తదుపరి పాస్పోర్ట్ కార్యాలయం లేకపోవడం దురదృష్టకరమని చెబుతూ పాస్పోర్ట్ కార్యాలయం కూడా జీవన్ రెడ్డి చొరవ తీసుకొని ఏర్పాటు చేస్తారని మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి పేర్కొన్నారు.
గతంలో ఉన్న ఎంపీలుగా ఉన్న నాయకులు అభివృద్ధి, సంక్షేమం కోసం శ్రద్ధ తీసుకోలేదని
ఆమె విమర్శించారు.
జగిత్యాల. పట్టణంలో
యావర్ రోడ్డు చాలా ప్రధానమైనసమస్య అని ఆనాడు 40 ఫీట్లు ఉన్న యావర్ రోడ్డును 60 ఫీట్లు చేసింది జీవన్ రెడ్డి ని చెప్పారు. అలాగే 100 ఫీట్లు చేసేది కూడా జీవన్ రెడ్డి మాత్రమేనని అందుకే ప్రజలంతా ఆశీర్వదించి జీవన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలు, నిరుపేదల సమస్యలు పరిష్కారానికి జీవన్ రెడ్డి మనకు తోడుగా ఉంటారని చెబుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తాటిపర్తి జీవన్ రెడ్డి ని గెలిపించాలని జ్యోతి ఓటర్లను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *