సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఆత్మహత్య చేసుకున్నఅరవింద్ కుటుంబాన్నిఆదుకోవాలి
* సీఐఎస్ ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతాల కార్ అరవింద్
బాసర త్రిబుల్ ఐటీ లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా తరగతులు చెబుతున్నారా అని చాత్ర యువ సంఘర్ష సమితి (సిఐఎస్ఎస్) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతాల కార్ అరవింద్ ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్రిబుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమన్నారు. ప్రభుత్వం మారిన ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. బాసర త్రిబుల్ ఐటీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకవైపు విద్యార్థుల ఆత్మహత్య చేసుకుంటే అరికట్టాల్సింది పోయి మాకు ఏమీ తెలియదు అంటూ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బడుగు, బలహీన పేద విద్యార్థులు ఎంతో కష్టపడి బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సంపాదించుకొని చదువుకోడానికి వస్తే అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా తమ బుద్ధిమానుకుని విద్యార్థుల పక్షాన నిలబడాలి డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న అరవింద్ కుటుంబానికి 50 లక్షలు, ఇంట్లో ఎవరికైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.