సిరా న్యూస్, జైనథ్
13న నిర్మల్కు మందకృష్ణ మాదిగ
పార్లమెంట్ నియోజక వర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలి
* ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ
ఈ నెల 13 న నిర్మల్ నిర్వచబోయే అదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ సమావేశం విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అల్లకొండ రవి మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ పాల్గొని మాట్లాడారు.ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజవర్గ పరిధిలోని ఎమ్మార్పీఎస్ అనుబంధసంఘాల సమీక్షా సమావేశం ఈ నెల 13న నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని దృష్టిలో అనుసరించాల్సిన ప్రణాళిక సిద్ధం చేసుకుని కార్యకర్తలకు దశ దిశ నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.సమావేశంలో దుమల దేవన్న మాదిగ, దేవేందర్ మాదిగ,దుమల శివ రాజు మాదిగ, కోడిచర్ల శివ కుమార్ అన్నెలా రాజు, గంగాధరి శివ కుమార్, ఈర్గల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు