సిరా న్యూస్, నిర్మల్:
ఆర్మీ జవాన్ ఆత్మహత్య…
+ వివాహా వేడుకల కోసం వచ్చి కానరానీ లోకాలకు
+ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య
+ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
బార్డర్లో రొమ్ము విరిచి, శత్రు సైన్యానికి ఎదురుగా నిలబడే ఆర్మీ జవాన్ తన జీవన పోరాటంలో యుద్దం చేయలేక తనువు చాలించాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… నిర్మల్ జిల్లా కేంద్రంలోని వేంకటపూర్కు చెందిన చందా రమేష్(28) ఆర్మీ జవాన్గా కొల్కత్తా బార్డర్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 15న బావమరిది పెళ్లి కోసమమని సెలవుల్లో స్వగ్రామానికి వచ్చాడు. నాగంపేట ముప్కల్ మండలంలోని బావమరిది వివాహానికి హాజరై ఆదివారం ఇంటికి తిరిగివచ్చిన ఆయన ఇంట్లోని తన రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో కుటుంబీకులు అతని రూమ్ను బలవంతంగా తెరిచి చూడగా, ఫ్యాన్కు వేళాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబీకులు బోరున విలపించారు. గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించడంతో, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామ నిర్వహించి, శవాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా మృతుడి తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.