బోనాలకు ఏర్పాట్లు పూర్తి

 సిరా న్యూస్,హైదరాబాద్;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ముఖ్యమైన దేవాలయాలకు మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. గతంలో అధికారులు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించేవారు. ఈసారి ప్రజల సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తూనే మంత్రులను భాగస్వామ్యం చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ నగరవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చెక్కుల పంపిణీ పూర్తయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 10% అదనంగా దేవాలయాలకు నిధులు కేటాయించడం.జరిగిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *