సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాం పల్లిలో ఈరోజు మధ్యాహ్నం పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి జన జాతర బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు నాయకులు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జన జాతర సభకు ప్రజలు భారీగా తరలి రాను ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.