సిరా న్యూస్,ఆచంట;
ఆచంట స్వీట్ హోమ్స్ 7 ఎకరాల లేఔట్ లో సభను ఏర్పాటు చేశారు టిడిపి శ్రేణులు. సభకు వచ్చే టిడిపి శ్రేణులకు, కార్యకర్తలకు అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 3.30 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుని ప్రసంగించనున్నారు చంద్రబాబు..జరుగుతున్న పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.మాజీమంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి ‘రా కదలిరా’ పేరిట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టారని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఈనెల 7న చంద్రబాబు ఆచంట పర్యటన ఖరారైన నేపథ్యంలో స్థానిక స్వీట్ హోమ్ ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగసభ, పార్కింగ్, హెలిప్యాడ్లను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం రగిలించడానికి చంద్రబాబు చేపట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు