సిరా న్యూస్;
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. భారత్ను 2047 నాటికి వికసిత భారత్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె అన్నారు. మోదీ సర్కార్కు చెందిన చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగినట్లు తెలిపారు. గడిచిన పదేళ్లలో మహిళల సాధికారత పెరిగిందన్నారు. ట్రిపుల్ తలాక్ను చట్టరీత్యా నేరం చేశామన్నారు. ప్రభుత్వ స్కీమ్ కింద 70 శాతం మంది మహిళలకు ఇండ్లు అందజేసినట్లు చెప్పారు. అన్ని రకాల మౌళికసదుపాయాల్ని రికార్డు సమయంలో క్రియేట్ చేస్తున్నట్లు తెలిపారు. భారత అభివృద్ధిలో దేశంలోని అన్ని ప్రాంతాలు భాగస్వామ్యం అవుతున్నాయన్నారు. వన్ నేషన్ వన్ మార్కెట్ వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉందన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం మహిళల సంఖ్య పెరిగిందన్నారు. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు ఆమె వెల్లడించారు.ఎన్నికల ముంగిట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పన్ను చెల్లింపు దారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. కొత్త ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్నులను మరింత సులభతరం చేస్తామి వెల్లడించరు. కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదని తేల్చి చెప్పారు. పన్నుల శ్లాబులు యథాతథంగా ఉంటాయని వెల్లడించారు.. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించారు. కార్పొరేట్ ట్యాక్స్ని 30% నుంచి 22%కి తగ్గించామని తెలిపారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని తెలిపారుప్రజల ఆకాంక్షలను నెరవేర్చే, సమ్మిళిత వృద్ధికి దారితీసే ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ – 2024 ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. ఆర్థిక విధానాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. 3 కోట్ల ఇళ్లు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం పూర్తయిందని, వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ కింద ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు.మధ్యంతర బడ్జెట్కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. మొబైల్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. సిమ్ సాకెట్లు, మెటల్ భాగాలు, సెల్యులార్ మాడ్యూల్స్, ఇతర మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 5 శాతం తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మిడిల్ కవర్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్ఎం యాంటెన్నా, పీయూ కేస్, సీలింగ్ గాస్కెట్, సిమ్ సాకెట్, స్క్రూలు, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెటీరియల్లపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించింది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో భారతదేశంలో ఫోన్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు మరింత ఊరట కలుగనుండగా.. దిగుమతి సుంకం తగ్గడంతో మొబైల్ఫోన్ల ధరలు సైతం తగ్గే అవకాశాలున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదికలో స్మార్ట్ఫోన్ల తయారీకి ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. ప్రభుత్వం చర్య మేక్ ఇన్ ఇండియాను ఊతమిస్తుందని చెప్పింది.జన్ ధన్ ఖాతాల్లో డబ్బు వేయడం ద్వారా రూ.2.7 లక్షల కోట్లు ఆదా అయ్యాయని, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అత్యున్నత స్థాయిలో ఉందని, ఇదిదేశానికి కొత్త దిశను, కొత్త ఆశలను ఇచ్చిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశ ఆర్థిక పురోగతిలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, వర్గాలు సమిష్టిగా లబ్ధి పొందేలా మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దశల వారీగా సమయోచితంగా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సర తాత్కాలిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెడుతూ ఈ సంగతి చెప్పారు. 2014లో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు దేశం పలు సవాళ్లను ఎదుర్కొన్నదని, ప్రస్తుతం సుసంపన్నంగా ఎదిగిందని పేర్కొన్నారు. 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ సరఫరా చేయడం ద్వారా ఆహార కొరతపై నెలకొన్న ఆందోళనను తొలగించామన్నారు. తమ ప్రభుత్వం అద్భుతమైన పనితీరు వల్ల దేశ ప్రజలు తిరిగి స్పష్టమైన తీర్పు ఇచ్చి దీవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.ఆర్థిక రంగాన్ని మరింత పటిష్ఠం చేసి, మరింత సులభంగా ఆపరేట్ చేయగలుగుతున్నాం. దేశ ద్రవ్యోల్బణంతో ఎదుర్కొన్న కఠిన సవాళ్లను అధిగమించి ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టాయి.