ఇద్దరు పెట్టుబడి మోసగాళ్ల అరెస్టు

సిరా న్యూస్,హైదరాబాద్;
ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని నగర సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు. నౌషద్ , కబీర్ అనే నిందితులను కేరళ లో అరెస్టు చేశాం. జనవరిలో ఓ విక్టిమ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్నం. టెలిగ్రామ్ ద్వారా పార్ట్ టైం ఉద్యోగాలు పేరుతో పరిచయం విక్టిమ్ కు నిందితులు పరిచయమయ్యారు. లింక్ షేర్ చేసి లింక్ క్లిక్ చేయడం ద్వారా నిందితులు విక్టిమ్ ను టెలిగ్రామ్ లో యాడ్ చేస్తారు. టెలిగ్రామ్ లో పార్ట్ టైం జాబ్ కు సంబంధించిన కొన్ని టాస్కులు ఇస్తారు. ఇందులో సోషల్ మీడియా లైకులు, లింక్స్ క్లిక్ చేయడం రేటింగ్స్ ఇవ్వడం లాంటి టాస్కులు ఇస్తారు. అంతర్జాతీయ కంపెనీల రివ్యూస్ రాయడం లాంటివి టాస్కులు ఇస్తారు. పార్ట్ టైం జాబ్ కావడంతో విక్టిమ్ జాయిన్ అయ్యారు..జాబ్లో జాయిన్ అయ్యాక కొంత అమౌంట్ వస్తుంది. విక్టిమ్ లకు నమకం కలిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని నమ్మిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేయించి కొంతవరకు రిటర్న్స్ తిరిగి ఇస్తారు. ఈ కేసులో విక్టిమ్ ఇదే తరహా నిందితుల మాటలు నమ్మి 9 లక్షల పైగా ఇన్వెస్ట్మెంట్ చేసింది. దీంతో నిందితులు రిటన్స్ ఇవ్వకుండా నిందితుల అకౌంట్ బ్లాక్ చేశారు. బ్లాక్ అయింది కాబట్టి అమౌంట్ రిలీజ్ అవ్వాలంటే పెద్ద మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పారు. దేనితో తాను మోసపోయాను అని తెలుసుకుని మాకు పిర్యాదు చేశారు.. దీంతో జనవరి లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని అన్నారు.
నిందితులు వాడిన అకౌంట్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు..బాధితుల డబ్బులు అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ కి వెళ్ళాయి. అకౌంట్స్ అన్ని దుబాయ్ లో ఆపరేట్ అవుతున్నాయి ..అకౌంట్ హోల్డర్ రాజస్థాన్కు సంబంధించిన వ్యక్తి. కేసు లోతుగా దర్యాప్తు చేసినప్పుడు మూలాలు అన్నీ కేరళలో కనిపించాయి. దీంతో టీం కేరళకు వెళ్లి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కమిషన్ దేశస్ మీద నిందితులు అకౌంట్స్ సేకరించి వాటి ద్వారా ట్రాన్సాక్షన్స్ చేశారు. ఆయా అమౌంట్ లోకి అమౌంట్ క్రెడిట్ అవంగానే క్రెప్టో కరెన్సీగా మారుస్తారు. అనంతరం వేరువేరు అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది… అనంతరం యుఎస్ డాలర్స్ గా మార్చి తిరిగి కేరళకు పంపుతున్నారు. మొత్తం 18 ఎకౌంట్లను గుర్తించాం.. ఇందులో 26 కోట్ల అక్రమ ట్రాన్సాక్షన్ లు జరిగాయి.
పోలీసులు ట్రేస్ చేయకుండా ఉండేందుకు నిందితులు రకరకాల టెక్నిక్స్ యూస్ చేశారని డీసీపీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *