సిరా న్యూస్, జైనథ్
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
* జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి
* అభివృద్ధి పనులకు భూమి పూజ
ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం జామిని గ్రామంలో 8 లక్షల రూపాయల నిధులు , భోరజ్ గ్రామంలో 5 లక్షల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి భూమిపూజ చేసారు. సీసీరోడ్డు ,డ్రైనేజీల పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇందుకోసం దాదాపు 5కోట్లకు పైగా నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజా పాలన సాగిస్తుందన్నారు. గ్రామంలో ప్రజా సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, అల్లూరి భూమ రెడ్డి, యాల్ల పోతా రెడ్డి, బాయిన్ వార్ గంగా రెడ్డి, బడాల రాజా రెడ్డి, ఎల్మ రామ్ రెడ్డి, తమ్మల చందు, మాజీ సర్పంచ్ పళ్ళ భూమయ్య , మహాజన్ కృష్ణ, సోనే రావు, గులాబ్, అవినాష్, సోము, విట్టల్, నరేష్, విలాస్, అనిల్, స్వామి, ఇస్తారీ, తానాజీ, మోహన్,షేక్ ఫరీద్ , భోరజ్ గ్రామ ఎంపీటీసీ మహేందర్,అల్చేట్టి రాజా రెడ్డి,తుక్ రెడ్డి ఆశయ్య, చిన్న భూమన్న, గన్నజీ రాజేష్, పొద్దుకూరి సుభాష్ రెడ్డి, పొద్దుకూరి నారాయణ రెడ్డి, గంగయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.