సిరా న్యూస్, ఆదిలాబాద్:
గొడం నగేష్ను కలిసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు
ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గొడం నగేష్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన స్వగృహంలో కలిసి శాలువాకప్పి ఘనంగా సన్మానించారు. అనతరం స్వీట్లు తినిపించి, శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. రానున్న ఎన్నికల్లో గెలుపు ఖాయమని, తామంత వెంట ఉన్నామని అన్నారు. కాగా తనను సన్మానించి ఆర్యవైశ్య సంఘం నాయకులకు గొడం నగేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగం సంతోష్, పడిగెల మధుకర్, గందేవార్ దయాకర్, గుండ వామన్, లింగయ్య, భాస్కర్, సురేష్ పోలవార్, తదితరులు ఉన్నారు.