సిరా న్యూస్,మంథని;
కాకతీయ పాఠశాల మంథనిలో ఆషాడ మాసం సందర్భంగా శుక్రవారం గోరింటాకు మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాసురేష్ రెడ్డి హాజరై గోరింటాకు యొక్క విశిష్టతను పిల్లలకు తెలిపారు. అనంతరం పిల్లలకు గోరింటాకు పెట్టి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్. ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ గోరింటాకు వల్ల చర్మ రోగాలు చాలా వరకు నిర్మూలించవచ్చని, ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల వారి ఇంట్లో శుభాలు జరుగుతాయని చెప్పారు. అదేవిధంగా గోరింటాకు పెట్టుకోవడం మన సాంప్రదాయమని , దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాసురేష్ రెడ్డి ని , వైస్ చైర్ పర్సన్ శ్రీపతి బానయ్య ని, కౌన్సిలర్ వి. కే.రవి ని మరియు కార్పెంటర్ అసోసియేషన్ సెక్రటరీ సమ్మయ్య ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో డైరెక్టర్లు రవి కిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, స్రవంతి మరియు పావని లు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.