సిరాన్యూస్, బేల
పాఠశాలలోని సమస్యలు పరిష్కరించాలి:టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్
పాఠశాలలు ప్రారంభానికి ముందే సమస్యలను పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడారు.బడులు ప్రారంభానికి ముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్ లను అందించాలని డిమాండ్ చేశారు.అలాగే ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యూనేషన్ వెంటనే విడుదల చేయాలనీ కోరారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులపైన నారాయణఖేడ్ ఆర్ డి ఓ పోలీసుల చేత లాఠీ ఛార్జ్ చేయించారని తెలిపారు. అతనిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు స్వామి,జిల్లా కార్యదర్శి ఈ .శివన్న, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కొల్లూరు. శంకర్ బేల మండల అధ్యక్షులు జయకర్ పాల్గొన్నారు.