సిరా న్యూస్,కుందుర్పి
ఈనెల29 నుంచి ఆర్డీటీ సీఈటీ ఉచిత శిక్షణ
* ఆర్డీటీ సెట్ శిక్షణా కార్యక్రమం కన్వీనర్ జి అశోక్ కుమార్
కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్డీటీ సీఈటీ ఉచిత శిక్షణా కార్యక్రమం ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభమవుతుందని ఆర్ డి టి సెట్ శిక్షణా కార్యక్రమం కన్వీనర్ జి అశోక్ కుమార్ తెలిపారు. గ్రామీణ పేద విద్యార్థులకు నెలరోజుల పాటు శిక్షణ ఇవ్వడానికి ఉపాధ్యాయ, సంఘాల సమన్వయ సమావేశం శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ ఉన్నత ఆశయాలతో ఎదగాలనుకునే బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీటీ సీఈటీ ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. నెలరోజుల పాటు జరిగే ఆర్డిటి సెట్ శిక్షణా కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరణం చిక్కప్ప హై స్కూల్ లో జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణ నిరుపేద విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో శెట్టూరు మండల విద్యాశాఖాధికారి శ్రీధర్ , ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాయల్ వెంకటేష్, స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు నరసింహులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మల్లికార్జున్ గౌడ్, సీఈటీ కన్వీనర్ అశోక్ కుమార్ గణిత సబ్జెక్ట్ నిపుణులు, జేఏసీ నాయకులు కె చిత్తయ్య రమేష్ బాబు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.