సిరాన్యూస్,చిగురుమామిడి
రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలి: రాష్ట్ర ఉద్యానవన పరిశ్రమ శాఖ సంచాలకులు కే అశోక్ రెడ్డి
* ఆయిల్ ఫామ్ నర్సరీని సందర్శన
రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని రాష్ట్ర ఉద్యానవన పరిశ్రమ శాఖ సంచాలకులు కే అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిగురుమామిడి మండల కేంద్రంలోని ఆయిల్ ఫామ్ నర్సరీ (లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్) ను ఆయను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్కలకు నీటి కొరత లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని ఆదేశించారు. అనంతరం పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన పరిశ్రమ శాఖ అధికారి బి శ్రీనివాస్, చిగురుమామిడి ఉద్యానవన శాఖ అధికారిని బి మంజువని , లోహియా అధికారి రోహిత్, ఆయిల్ ఫామ్ కన్సల్టెంట్ రంగనాయకులు, మేనేజర్ భరత్ నర్సరీ ఇన్చార్జిలు ఫీల్డ్ ఆఫీసర్లు మ్యాదార వెని ప్రవీణ్ పాల్గొన్నారు.