సిరాన్యూస్, బోథ్
కాంగ్రెస్ లో చేరిన ధన్నూరు గ్రామ యువకులు
* పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు అశ్విన్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూరు గ్రామానికి చెందిన దాదాపు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో వీరందరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అశ్విన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సోనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.