ఈనెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఉప ముఖ్యమంత్రి భట్టి

సిరా న్యూస్,ఖమ్మం;
మధిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా తో మాట్లాడారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ మధిర నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఉన్నతి పదవి చేపట్టాను. అందరి కృతజ్ఞతలని అన్నారు.
ఈ నెల 14 నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. చారిత్రాత్మక విజయం తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ సమాజం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. గత పదేళ్లుగా బి. ఆర్.ఎస్ ప్రభుత్వం పాలనా అంత అస్తవ్యస్తం.. రాష్ట్ర సంపద అంతా దోపిడీ గురైంది. పూర్తిగా 10 ఏళ్ళల్లో రాష్ట్రం 70 ఏళ్ళు అభివృద్ధిలో వెనకబడిందని అన్నారు.
బిఆర్ఎస్ హయంలో ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడింది. ప్రభుత్వంలో ఉన్నా ప్రతి వ్యవస్థ ప్రజలకోసంమే పనిచేసేలా పాలనా కొనసాగిస్తాం. భారత రాజ్యంగా స్పూర్తితో పాలనా అందిస్తాం. కుట్రపూరితమైన పాలనకు చరమగీత పాడారు. మండల,జిల్లా స్థాయిలో ప్రజా దర్బార్లు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిస్కారం చేస్తాం. రాష్ట ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం త్వరలో విడుదల చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *