కోనరావుపేట, సిరా న్యూస్
అంచెలంచెలుగా ఎదిగిన చంద్రశేఖర్ రెడ్డి
ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ అగర్తలా అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్ గా నియామకం
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కనగర్తి గ్రామానికి చెందిన డాక్టర్ పుట్ట చంద్రశేఖర్ రెడ్డి ఇందిరాగాంధీ ఓపెన్ నేషనల్ యూనివర్సిటీ లో త్రిపుర స్టేట్ అగర్తలా లో అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ గా నియామకం అయ్యారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతానికి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి 2009లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ముందుండి నడిపించారు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూ ఏబీవీపీ లో జాతీయ కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర కార్య సమితి సభ్యులుగా ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు. విదేశీ విద్యార్థులకు సంబంధించిన WOSY వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ అనే సంస్థకి హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్ గా, అంతర్జాతీయ కార్యదర్శిగా, అంతర్జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 85 దేశాలకు సంబంధించి విదేశీ విద్యార్థులను భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేస్తూ వసుధైక కుటుంబం అనే అనే భారతీయ ఫిలాసఫీ తో వారందరినీ భారతీయ సంస్కృతిలో మమేకం చేశారు. ఎన్నో ఉద్యమాలు చేస్తూనే దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఎస్ ఐఆర్ జే- ఆర్ ఎఫ్(CSIR-JRF) ఫెలోషిప్ ను సాధించి ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్ డీలో చేరి 2017లో డాక్టరేట్ ను రసాయన శాస్త్రంలో పొందారు. 2018లో దేశంలోనే ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటైన రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్ఈసీ వరంగల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NIT-W)లో డిపార్ట్ మెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి 2019లో డిపార్ట్ మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఉస్మానియా యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధుల్లో చేరి 2023 డిసెంబర్ వరకు పనిచేశారు. ప్రస్తుతం ఇగ్నో త్రిపుర రీజినల్ సెంటర్, అగర్తలా లో అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ గా కేంద్ర ప్రభుత్వ అధికారిగా నియామకం కావడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ఎందరో విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లు, వైస్ ఛాన్స్లలర్ర్లు, సామాజికవేత్తలు, మేధావులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు