Athram Sakku: విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతాం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతాం
* బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు
* ఎన్నికల సన్నద్దతపై సుదీర్ఘంగా చర్చ‌
పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పతకాలను వివరిస్తూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుంచుతామని బీ.ఆర్.ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న నేతృత్వంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల సన్నద్దతపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా పార్టీ నేతలు ఆత్రం సక్కును శాలువా, పుష్పగుచ్చలతో సత్కరించి అభినందనలు తెలియచేశారు. . ఈమేరకు బీ.ఆర్.ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమార్థం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక పతకాలను ప్రవేశపెట్టి సమర్ధవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు. పేదల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పాలన సాగిందని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతోందని ఆరోపించారు. అటు కేంద్రంలోని బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, సీసీఐ పునరుద్ధరణ, టెక్స్ టైల్ పార్కు, గిరిజన యూనివర్సిటీ వంటి అంశాలపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. తనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆయన… గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా శ్రేణులు కృషి చేయాలనీ సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత శ్రేనులపై ఉందని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏడూ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, మహిళా అధ్యక్షురాలు స్వరూప రాణి,సాజిదోద్దీన్, ప్రకాష్, నర్సింగ్, భరత్, అష్రఫ్, మోబిన్, విజ్జగిరి నారాయణ, రాము తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *