Atrocity in Narsingi…..watchman was killed : నార్సింగీ లో దారుణం…..వాచ్ మెన్ హత్య

సిరా న్యూస్,రంగారెడ్డి;
మంచిరేవుల లో జంగయ్య అనే వాచ్ మన్ దారుణ హత్యకు గురయ్యాడు. వాచ్ మన్, తాపీ మేస్త్రీ ల మద్య వివాదం తో హత్య జరిగింది. చాచ్ మెన్ జంగయ్య గత కొన్ని రోజులుగా యజమానికి తెలియకుండా స్క్రాప్ అమ్ముకుంటున్నాడు. ఇది తాపీ మేస్త్రీ కంట పడింది. వాచ్ మెన్ ను మేస్త్రీ ఆర్జున్ హెచ్చరించాడు.అయినా అర్జున్ మాటలు పట్టించుకోకుండా జంగయ్య మళ్లీ స్క్రాప్ అమ్మకం కొనసాగించాడు. జంగయ్య చేస్తున్న పనిని యజమానికి మేస్త్రీ అర్జున్ చెప్పాడు. దాంతో యజమాని వాచ్ మెన్ జంగయ్య కు ఫోన్ చేసి హెచ్చరించాడు. సంక్రాంతి పండుగ కావడంతో వాచ్ మెన్, మేస్త్రీ తప్పతాడారు. తరువాత జంగయ్య నా పైనే యజమానికి ఫిర్యాదు చేస్తావా అంటూ ఘర్షణ కు దిగాడు. గొడవలో మత్తు లో పదునైన ఆయుధం తో వాచ్ మెన్ తల పై అర్జున్ బాదాడు. స్పాట్ లో కుప్పకూలిన జంగయ్య మృతి చెందాడు. హంతకుడు అక్కడి నుండి పరారైయాడు. స్థానికులు 100 ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *