అంబులెన్స్ డ్రైవర్లపై దాడి..గాయాలు

సిరా న్యూస్,రంగారెడ్డి;
హైదరాబాద్ కామినేని చౌరస్తాలో దారుణం జరిగింది. అబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో దాడి చేసారు. తమ వ్యాపారానికి అడ్డువస్తున్నారని న్యూ మల్టీ కార్ సిబ్బంది దౌర్జన్యం చేసారు. ప్రైవేట్ ఆస్పతులకు రోగులను షిఫ్ట్ చేసే అంబులెన్స్ లు, ట్రాఫిక్ కి ఇబ్బంది కాకుండా గత కొన్నిలుగా పార్కింగ్ చేస్తున్నారు.అక్కడ అంబులెన్స్ పార్క్ చేయొద్దు అంటూ డ్రైవర్లతో న్యూ మల్టీ కార్ ఓనర్ గొడవకు దిగాడు. అంబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో దాడి చేయడంతో పలువురికి గాయాలు అయ్యాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. గొడవను సద్దుమణిగించే ప్రయత్నంలో ట్రాఫిక్ ఎస్ఐతో వాగ్వాదాని దిగారు. గొడవలో గాయపడ్డ వారిని చికిత్స కోసం హాస్పిటల్ తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *