విద్యుత్ సిబ్బంది ధర్నా
సిరా న్యూస్,హైదరాబాద్;
విద్యుత్ బిల్ కలెక్టర్ రాజినీష్ బాబుక్ పై దాడికి నిరసనగా టీఎస్ యుఈ ఈయు – సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో అస్మాన్ ఘడ్ విద్యుత్ డి ఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.కూర్మగుడా కార్పొరేటర్ మహాపారా ఇంటి బకాయి ఉండటంతో వెళ్లిన విద్యుత్ ఉద్యోగి పై కుటుంబ సభ్యులు దాడి చేయడం దారుణమని అన్నారు. విద్యుత్ కార్మికుల పై ఇలాంటి దాడులు జరుగకుండా యాజమాన్యం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.పాతబస్తీలో విద్యుత్ కార్మికులు విధులు నిర్వహించాలంటే భయబ్రాంతులకు గురైతున్నారు అంటూ వాపోయారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు.