సిరా న్యూస్,పెద్డపల్లి;
కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆస్పత్రి లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మహేందర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. డాక్టర్ విధులు ముగించుకొని కారులో పెద్దపల్లికి వెళ్తుండగా బూరుగుపల్లి వద్ద ఇనుప రాడ్లతో డాక్టర్ పై దుండగులు దాడికి పాల్పడ్డారు. డాక్టర్ మహేందర్ పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. .