సిరా న్యూస్,హైదరాబాద్;
తల్లిని దూషించావెందుకని ప్రశ్నించిన యువకుడి పై హాస్టల్ నిర్వాహకులు మూక్కుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం. పల్నాడు జిల్లా పెదకూరపాడుకు చెందిన సయ్యద్ అసిఫ్ బీకెట్ పూర్తి చేసుకుని నగరానికి వచ్చి ఎస్.ఆర్ నగర్ లోని శ్రీ బాలాజీ బాయిస్ హాస్టల్ ఉంటూ కంప్యూటర్ కోర్సు నెర్చుకుంటున్నాడు. కాగా ఆదివారం తనను కలిసేందుకు తన స్వగ్రామం నుంచి స్నేహితుడైన జహీర్ అనే ప్రైవేటు ఉద్యోగి వచ్చాడు. హాస్టల్లోని వాష్ రూమ్ లో జహీర్ ముఖం కడుకున్నాడు. స్నేహితులు ఆసిఫ్, జహీర్లు హాస్టల్ నుంచి బయటకు వస్తుండగా హాస్టల్ నిర్వాహకుడు లోపలికి ఎందుకు తీసుకుని వచ్చావ్ అంటూ వాగ్వివాదానికి దిగి హాస్టల్ నిర్వాహకుడు దుర్బాషలాడి తల్లి పేరుతో తీవ్ర పదజాలంతో దూషించాడు. తన తల్లిని ఎందుకు తిట్టావని ఆసిఫ్ వారిని ప్రశ్నించాడు. ఆవేశానికి లోనైన హాస్టల్ నిర్వాహకుడు, అతని కుటుంబీకులు మూకుమ్మడిగా ఆసీఫ్ పై దాడికి పాల్పడ్డారు. నడి రోడ్డు పై అందరి ముందు యువకుడ్ని పట్టుకుని చితకబాదుతుంటే అక్కడ స్థానికులు భయభ్రాంతులకు గురైయ్యారు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆసిఫ్ ఎస్.ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.