పెనుగొండ పీఎస్ పై దాడి..55 మంది అరెస్టు

సిరా న్యూస్,పెనుగొండ;
ఈ నెల 21 వ తేదీన పెనుగొండ పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఘటనలో 55 మంది అరెస్ట్ చేసారు. నిందితుల అరెస్టుపై పెనుగొండ సిఐ రజిని కుమార్, సిఐ సుభాని ఆధ్వర్యంలో నర్సాపురం డీఎస్పీ జి.శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఆచంట గ్రామానికి చెందిన యువకుడు రెండు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ చేసిన పోస్ట్ పై అతనిపై కేసు నమోదు చేసాం. అదే సమయంలో పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్.. పోస్ట్ చేసిన యువకుడ్ని విచారిస్తున్న సమయంలో కొంతమంది యువకులు స్టేషన్లో దౌర్జన్యంగా చరబడి.. స్టేషన్ అద్దాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదు చేసాం. ఆ గలాటాలో 22 వ తేదీన 18 మందిని అరెస్ట్ చేసి.. రిమాండ్ కి పంపించాం. అందులో నలుగురు చిన్నపిల్లలు ఉండడంతో వారిని కస్టడీలోకి తీసుకుని.. జువైనల్ హోమ్ కి పంపించాం. సిసి ఫుటేజ్ ఆధారంగా 23 మందిని ఐడెంటిఫై చేసి అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. ఈరోజు ఇంకా పదిమంది చిన్న పిల్లలను తీసుకుని.. జువైనల్ హోమ్ కి పంపించామిన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *