టీడీపీ నేతలపై దాడి

సిరా న్యూస్,కుప్పం;
కుప్పం పరిధి తంబిగానిపల్లెలో 5 వార్డు లో టీడీపీ వర్గీయులపై దాడి జరిగింది. కౌన్సిలర్ సెల్వం, టీడీపీ మాజీ వార్డు మెంబర్ అశోక్ , కార్యకర్తలపై దాడికి వైసీపీ నేతలు దిగారు. వైసీపీ నేతలు సాయి కిరణ్, యమరాజ్ ,నాగరత్నం దాడి చేసినట్లు గుర్తించారు. గాయపడిన కౌన్సిలర్ సెల్వం, కార్యకర్తను ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల రోజు ఘటన నేపథ్యంలో వైసీపీ నేతలు దాడికి దిగారు. టీడీపీ వార్డు మెంబర్ అశోక్ తల పై ఇనుప ర్యాడ్ తో దాడి జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *