సిరా న్యూస్,నెల్లూరు;
రూరల్ నియోజకవర్గం లోని 34 డివిజన్లో వైసిపి – టిడిపి నేతల మధ్య ఘర్షణ నెలకొంది. టిడిపికి ఈ డివిజన్లో ఆదిక్యత రావడంతో దాడులు మొదలయ్యాయి. ఇద్దరు టిడిపి కార్యకర్తలు పై కత్తితో వైసిపి డివిజన్ ఇంచార్జ్ రియాజ్ కత్తితో దాడి చేసాడు. షేక్ ఖలీల్, పటాన్ సులేమాన్ పై కత్తితో దాడి జరిగింది. వారిని ఆసుపత్రికి తరలించారు. కార్పొరేటర్ భర్త, వైసిపి ఇన్చార్జ్ రియాజ్ పోలీసుల అదుపులో వున్నాడు. వివాదంపై ఆరా తీసి బాధితులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు.
=====================