టిడిపి కార్యకర్తలపై – వైసీపీ కార్యకర్తల దాడి

సిరా న్యూస్,ఏలూరు;
ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులో టిడిపి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి జరిగింది. కూలింగ్ షాపు వద్ద కూల్ డ్రింక్ తాగుతున్న టిడిపి కార్యకర్తలలో కవ్వింపు చర్యలకు వైసీపీ కార్యకర్తలు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కూల్ డ్రింక్ షాప్ లోని కూల్ డ్రింక్ సీసాలతో టిడిపి నేతలపై వైసిపి కార్యకర్తలు దాడి చేసారు. ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *