చర్చి ముందు రోడ్డు విషయంలో దాడి

పలువురిపై కేసు నమోదు..పదకొండు మంది జైలుకు
సిరా న్యూస్,చేవెళ్ల;
శంకర్ పల్లి మండలం జనవాడ గ్రామంలో చర్చి ముందు రోడ్డు విషయం పై జరిగిన దాడి ఘటనలో మొత్తం 30 మంది పై ఎస్సీ ఎస్టీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇందులో 11 మందిని రిమాండ్ కు తరలించగా మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ నెల 21 వరకు గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది అని, అవసరమైతే మరిన్ని రోజులు 144 సెక్షన్ పొడగించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు, బయటి వ్యక్తులను గ్రామంలోకి అనుమతించడం లేదు, ఎటువంటి ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలకు అనుమతులు లేవని ఆంక్షలను ఎవరైనా ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *