కర్ణాటక అక్రమ మద్యం రవాణ పై దాడులు

20 కర్ణాటక మద్యం బాక్సులు స్వాధీనం

సిరా న్యూస్,కౌతాళం;
అక్రమంగా తరలిస్తున్నకర్నాటక మద్యం బాక్సుల రవాణ పై దాడులు నిర్వహించగా వారి నుండి 20 బాక్సులు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిఎస్పి, సీతారామయ్య సీఐ, సీఐ ప్రసాద్ ఆదేశాల మేరకు సిబ్బందితో కలిసి అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం రమణ పై దాడులు చేసి వారి వద్ద నుండి 20 బాక్సులు 90 ఎం.ఎల్ 1921 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆక్రమంగా మద్యం రవాణా చేస్తున్న గోతుల దొడ్డి గ్రామానికి చెందిన దుర్గయ్య, హనుమేష్, నాగేష్ ,మోటర్ బైక్ పై తరలిస్తుండగా వారిని వెంబడించి పట్టుకోగా ఒకరు ముద్దాయి తప్పించుకున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనం స్వాదినం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. సుమారు వీటి విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుందన్నారు..అదికారులు ఎస్సైను ,పోలీస్ సిబ్బంది నారాయణ, నరేంద్ర, మద్దిలేటి, రంగన్న ,లను అభినందించారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *