ట్రైన్ లో లైంగిక దాడికి యత్నం – మద్యం మత్తులో

ట్రైన్ నుంచి జారి క్రిందపడిన మహిళ

లైంగిక దాడికి యత్నించిన వ్యక్తి కూడా ట్రైన్ నుండి క్రింద పడిన వైనం
సిరా న్యూస్,మిర్యాలగూడ;

విశాఖ ఎక్స్ ప్రెస్ రైల్లో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రయాణికు రాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన లో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ మంగళవారం రాత్రి 7గంటలకు మిర్యాలగూడ స్టేషన్కు చేరుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైలు వేగం తగ్గింది. అదే సమయంలో ఎస్-2 బోగీలో ప్రయాణిస్తున్న ఓ మహిళ వాష్రూమ్ నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా డోర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఒడిశాకు చెందిన బిశ్వాస్.. ఆమె నడుము పట్టుకుని కిందకు లాగాడు. ఈ క్రమంలో ప్రయాణికురాలు రైలు నుంచి కిందపడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బిశ్వాస్ కూడా రైలు నుంచి కిందపడ్డాడు. గాయ పడిన బాధితురాలు సమీపంలోని తండా వద్దకు నడుచుకుంటూ వెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వారు వెంటనే రైల్వేర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రైల్వే ఎస్ఐ పవన్ కుమార్రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని మహిళను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. రైలు పట్టాలపై కొంత దూరంలో మద్యం మత్తులో పడి ఉన్న బిశ్వాస్ను మరో అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *