Aude Noor Singh: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
* పీఆర్‌టీయూ తెలంగాణ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తూ, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల‌ని పీఆర్‌టీయూ తెలంగాణ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వేతన సవరణ (పీఆర్‌సీ) కమిటీ ఆహ్వానం మేరకు గురువారం హైద‌రాబాద్‌లోని బీఆర్‌కే భవన్ కార్యాలయంలో పీఆర్‌టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మంచి రెడ్డి అనంతరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, డాక్టర్ పర్వతి సత్యనారాయణ, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి బాలాజీ వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు, జిల్లాల నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా ఉండే వివిధ అంశాలను, రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు, అన్ని యాజమాన్యాల్లోని వివిధ విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉపాధ్యాయుల, బోధనేతర సిబ్బంది, పెన్షనర్స్ కు సంబంధించిన వేతన సవరణ ,తదితర అంశాలపై చర్చించి పిఆర్సి నివేదికలో పొందుపరచాలని కోరారు. స‌మావేశంలో ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్రా నవీన్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  జాదవ్ ప్రకాష్ ,రాష్ట్ర కార్యదర్శి రాథోడ్ రవీందర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *