Aurelli Mallesh: కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలి

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలి
ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ
*మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి ఖబడ్దార్
పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాల‌ని ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్ లో ఆయన మాట్లాడుతూ నిన్న నారాయణపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ ఉద్యమం పట్ల మంద కృష్ణ మాదిగ గురించి అహంకారంతో కుట్రబుద్ధితో మాట్లాడార‌ని , మాదిగలను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. రాష్టంలో మూడు ఎస్సి పార్లమెంటు స్థానాలతో పాటు ఒక్క కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్రంలో 80 లక్షల మంది మాదిగలకు ఒక్క సీటు అవకాశం ఇవ్వకుండా, పైగా మాదిగలకు ఏదో ఒరగపెట్టినట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో మాదిగల శక్తితో ఓటు చైతన్యంతో మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు చిత్తుచిత్తుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించి తీరుతామ‌ని తెలిపారు.ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో నీలాంటి ఎందరో ముఖ్యమంత్రులను ఎదుర్కొన్న చరిత్ర ఎమ్మార్పీఎస్ కు మందకృష్ణ మాదిగ నాయకత్వం కు ఉంద‌న్నారు. రెండు పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ టికెట్ కూడా మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి శ్రీను మాదిగ, ఆర్ సందీప్ మాదిగ, అజయ్ గణేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *