Auto Accident: అటో బోల్తా… యువకుడి మృతి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

అటో బోల్తా… యువకుడి మృతి
+ జైనథ్‌ అలుముకున్న విషాద ఛాయలు

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని తరోడ–బి గ్రామ సమీపంలో ఆటో బోల్తాపడి శనివారం రాత్రి ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం… జైనథ్‌కు చెందిన జక్కుల్‌వార్‌ రికేష్‌ తన ఆటోలో ఆదిలాబాద్‌లో ప్రయాణికులను ఎక్కించుకొని, శనివారం రాత్రి జైనథ్‌ వైపుకు బయలు దేరాడు. రాత్రి తరోడ–బి గ్రామ సమీపానికి చేరుకోగానే, నిషేదిత వంతెన మీదుగా ఆటో ఎక్కించాడు. మద్యం మత్తులో ఉండటమే కాకుండా, నిర్లక్ష్యంగా ఆటో నడపడంతో ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న జైనథ్‌కు చెందిన ఇప్ప భరత్‌ కుమార్‌(38) అనే యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న పుష్ప, పద్మ అనే మరో ఇద్దరు మహిళలు గాయాలు కాగా, చికిత్స కోసం వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కి తరలించారు. ఈ మేరకు మృతుడి సోదరుడు ఇప్ప సుభాష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆటో డ్రైవర్‌ రికేష్‌ను అదుపులోకి తీసుకొని, ఆటోను సీజ్‌ చేసారు. నిందితునిపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించినట్లు సీఐ డి సాయినాథ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *