ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయంలో సైదులు అనే ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసాడు. బిఆర్ఎస్ పార్టీ ఆటో యూనియన్ నాయకుడు పాల్వంచ కృష్ణ ఈ రోజు కాంగ్రెస్ లో చేరుతుండగా కృష్ణ బిఆర్ఎస్ లో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఆటో యూనియన్ సభ్యులను అనేక రకాల కేసులు పెట్టి వేధించాడని అతను కాంగ్రెస్ లో చేరితే ఆటో డ్రైవర్లు అనేక మంది మళ్లీ ఆత్మహత్య చేసుకుంటారంటున్న సైదులు అనే ఆటో డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేసాడు. దీంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకునే ప్రయత్నం చేసారు. అక్కడ ఉన్న కొంతమంది నాయకులు అతడిని శాంతింపచేసారు. గత ప్రభుత్వ పెద్దల అండతో ఆటో యూనియన్ నాయకుడు తమను వేధింపులకు చేసి కేసులు పెట్టించినట్లు చెప్పారు. ఈ ఘటనతో కాంగ్రెస్ లో చేరకుండా బిఆర్ఎస్ ఆటో యూనియన్ నాయకుడు పాల్వంచ కృష్ణ వెనుతిరిగి వెళ్లిపోయాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *