సిరా న్యూస్, కళ్యాణదుర్గం
అన్నదాన కార్యక్రమానికి రూ.25వేల విరాళం
* ఆలయంలో అవినాష్ ప్రత్యేక పూజలు
పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా శనివారం టిడిపి నేతలు అభిరుచి నేని సురేంద్రబాబు మేనల్లుడు అవినాష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఆలయంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి తనవంతుగా రూ.25వేలు విరాళం అందించారు.