సిరా న్యూస్,మంథని;
కనుమ పండుగను పురస్కరించుకొని మంథని పెంజెరుకట్ట బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో ఉత్తమ ఫలితాలను సాధించిన మంథని మున్సిపల్ పరిధిలోని రైతులు ముత్యాల శ్రీకాంత్-స్వరూప, మేక నాగేశ్వర్ రావు- లక్ష్మి దంపతులను టక్కెగారి ఉమాదేవి కిట్టన్న దంపతులు మంగళవారం రాత్రి ఘనంగా సన్మానించారు. ప్రధానంగా సంక్రాంతి భోగి సంక్రాంతి కనుము విశిష్టతను తెలియజేయడం కోసం అలాగే వ్యవసాయ రంగంలో విశేషంగా కృషి చేస్తూ పరిశుద్ధులను పోషిస్తున్నటువంటి రైతులను అభివృద్ధి చేయటం కోసం వారిని ప్రోత్సహించడం కోసం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ రైతు దంపతులను సన్మానించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పెంజరు కట్ట ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో కే.రఘోత్తం రెడ్డి,గోటికార్ కిషన్ జి , లోకే మనోహర్ రావు, టక్కేగారి మనోజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు