ట్రినిటీ డిగ్రీ విద్యార్థుల నృత్యప్రదర్శనతో చెత్తపై అవగాహన

సిరా న్యూస్,పెద్దపల్లి;
స్వచ్ సర్వేక్షన్ – 2024 స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద ట్రినిటీ డిగ్రీ విద్యార్థులచేత నృత్యప్రదర్శన తో చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఎన్ ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ముందుగా పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి పావురాలను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలు తమ ఇండ్లలో వెళ్లే చెత్తను తడిపొడి చెత్తగా వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని రోడ్ల పైన చెత్తాచెదారం వేయరాదని దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలని పట్టణ ప్రజల అవగాహన కోసం ట్రినిటీ డిగ్రీ విద్యార్థుల చేత ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అలాగే పెద్దపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుదామని ప్రజలు మున్సిపల్ సిబ్బంది విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కి అలాగే ట్రినిటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నీతరెడ్డి కి వారి యాజమాన్యానికి మిత్రులకు పోలీసు వారికి ప్రతి ఒక్కరి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మేనేజర్ శివప్రసాద్, టిపిఎస్ వినయ్, జూనియర్ అసిస్టెంట్లు ఆరేపల్లి సురేందర్, దేవానంది రమాకాంత్, మున్సిపల్ సిబ్బంది, ట్రినీటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నీతరెడ్డి, ట్రినిటీ కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *