సిరా న్యూస్,హైదరాబాద్;
ఎనభై శాతం ఆక్సిడెంట్స్ రాంగ్ రూట్ ద్వారా ప్రయాణించే వారి వల్లే జరగడంతో ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఈరోజు టాపిక్ అడిషనల్ కమిషనర్ ఆదేశాల మేరకు సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో మూడు గంటల పాటు స్పెషల్ రైడ్స్ నిర్వహించి సుమారు 220 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వద్ద వీరికి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం చలాన్ కట్టించి ద్విచక్ర వాహనాలను వారికి తిరిగి ఇచ్చేశారు. ప్రజలు రాంగ్ రూట్లో వెళ్లడం సరికాదని రెండు లేదా మూడుసార్లు చలాన్ వేసిన తర్వాత తిరిగి పట్టుపడితే కోర్ట్ ద్వారా వాహనాలను తీసుకోవాల్సి వస్తుందని ప్రజలకు ట్రాఫిక్ డిసిపి వెంకటేశ్వర్లు సూచించారు.