Ayodhya Padayathra: అయోధ్యకు పాదయాత్రగా భైంసా యువకుడు

సిరా న్యూస్, నిర్మల్‌:

అయోధ్యకు పాదయాత్రగా భైంసా యువకుడు
+ మోడీ సర్కార్‌ మూడోసారి రావాలని పూజలు

కార్యకర్తలు తమ నాయకుడి మీద ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. తమ పార్టీ గెలవాలనీ పూజలు, హోమాలు చేస్తుంటారు. కానీ నిర్మల్‌ జిల్లా భైంసాకు చెందిన అరవింద్‌ మహీషా అనే బీజేపీ కార్యకర్త మాత్రం, ఏకంగా ఆదిలాబాద్‌ నుండి అయోధ్య రామాలయానికి పాదయాత్ర చేపట్టి అందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే… అరవింద్‌ మహీషా గత డిసెంబర్‌ 13న ఆదిలాబాద్‌ నుండి ఆయోధ్యకు పాదయాత్రను ప్రారంభించాడు. మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైన పట్టువీడకుండా పాదయాత్ర కొనసాగించి, ఈ నెల 12న అయోధ్య చేరుకున్నాడు. రామ రాజ్యం రావాలన్నా… భారత దేశం సుభీక్షంగా ఉండాలన్నా… మోడీతోనే సాధ్యమని ఆయన అంటున్నారు. మూడవసారి సైతం మోడీ ప్రధానమంత్రి కావాలని రామాలయంలో పూజలు చేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *